మాధవరం సరిహద్దు చెక్ పోస్టు వద్ద కర్ణాటక నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న శీతలపానీయాల వ్యాన్పై అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. శీతలపానీయాల మధ్యలో ఉంచిన 63,153 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఆరు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వినుకొండకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
శీతలపానీయాల వ్యాన్లో గుట్కా రవాణా.. ఒకరు అరెస్ట్ - కర్నూలు గుట్కా కేసులు
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం వద్ద కూల్ డ్రింక్స్ వ్యాన్లో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ ఆరు లక్షలు ఉంటుందని తెలిపారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కూల్ డ్రింక్స్ వ్యాన్లో గుట్కా పట్టివేత.. ఒకరు అరెస్ట్