ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 29, 2020, 3:56 PM IST

ETV Bharat / state

హత్య కేసును ఛేదించిన పోలీసులు... నలుగురు అరెస్టు

కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగానే నిందితులు.. ఈ ఘాతూకానికి ఒడిగట్టినట్లు తెలిపారు.

police chase murder case in nandhyala kurnool district
హత్య కేసును ఛేదించిన పోలీసులు... నలుగురు అరెస్టు

కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన హత్య కేసును నంద్యాల పోలీసులు ఛేదించారు. నలుగురి నిందితులను అరెస్టు చేశారు. పొన్నాపురం గ్రామానికి చెందిన మనోహర్ గౌడ్, పెద్ద కొట్టాలకు చెందిన రవికుమార్, సురేంద్ర, హరి నాయక్​లు కలిసి ఈ హత్య చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు.

తెదేపాలో కొనసాగుతోన్న మనోహర్ గౌడ్... ఇటీవల వైకాపా లో చేరేందుకు ప్రయత్నిస్తుండగా... సుబ్బరాయుడు అడ్డుతగులుతున్నాడని భావించాడు. దీనిపై కోపం పెంచుకున్న మనోహర్ గౌడ్.. సుబ్బరాయుడును హతమార్చాలని భావించాడు. ఈ క్రమంలో సుబ్బారాయుడిని కట్టెతో కొట్టి హతమార్చాడు. ఈఘటనపై నమోదైన కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేశారు.

ఇదీచదవండి.

ఎన్నికలు వద్దనడం ఓటమి భయమే: యనమల

ABOUT THE AUTHOR

...view details