కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామానికి చెందిన ఊదర అభిషేక్ విద్యుత్ శాఖలో ఒప్పంద పద్ధతిలో జూనియర్ లైన్మెన్గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను.. తనకు నెలకు వచ్చే వేతనం రూ.15 వేలు సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ ద్వారా వీడియోలు చూసి చోరీకి సిద్ధమయ్యాడు. ఇందుకోసం గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంను ఎంచుకున్నాడు.
ఆదాయం సరిపోక.. చోరీకి యత్నం - attempted to atm theft news
ఏ పనిలేక దొంగతనాలకు పాల్పడేవారుంటారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేసేవారుంటారు. ఉద్యోగం ఉండి ఆదాయం సరిపోక ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఈ ఘటన జరిగింది.
రెండు రోజుల క్రితం ఇనుపరాడుతో ఏటీఎంను ధ్వంసం చేసి.. దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చోరీ యత్నం జరిగిందని గుర్తించిన బ్యాంక్ మేనేజర్ బ్రహ్మ గుప్తా శ్రీశైలం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్థానిక ఎస్సై మల్లికార్జున తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్తో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. రెండు రోజుల వ్యవధిలోనే దొంగను అరెస్టు చేసినట్లు సీఐ బి.వి.రమణ తెలిపారు. నిందితుడిని ఆత్మకూరు కోర్టులో హాజరు పరచి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:ఎన్నికల వేళ... లక్షల్లో నగదు పట్టివేత..ఇద్దరు అరెస్ట్