కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని... విద్యార్థులు ఈ నెల 22న సీఎం ఇంటి ముట్టడికి కార్యచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా కర్నూలు నుంచి విద్యార్థి సంఘం నాయకులు అమరావతికి బయలుదేరుతుండగా... రాయలసీమ విశ్వవిద్యాలయం వద్ద వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భగా విద్యార్థి సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
సీఎం ఇంటి ముట్టడికి యత్నం... విద్యార్థుల అరెస్టు
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు ముఖ్యమంత్రి ఇంటిముట్టడి కార్యక్రమం చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
police arrest students in kurnool