ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 16, 2020, 9:22 PM IST

ETV Bharat / state

ఆదోనిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు

కర్నూలు జిల్లా ఆదోనిలో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. అధికార పార్టీ వారే తమకు నచ్చినవాళ్లకు యూరియా బస్తాలు అందించేలా అధికారులకు సూచిస్తున్నారని రైతులు వాపోయారు.

people waiting in que for urea at adhoni
ఆదోనిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు



కర్నూలు జిల్లా ఆదోనిలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే కొవిడ్ నిబంధనలు పాటించకుండా అధికారుల నిర్లక్ష్య వైఖరితో రైతులు రోజుల తరబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. గ్రామంలో వాలంటీర్​లు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికి....పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. గ్రామాల్లో యూరియా అందకపోవడం వల్ల ఆదోని వస్తే అక్కడ కూడా రైతులకు దక్కడం లేదు. నాలుగు రోజుల నుంచి వరుసలో నిలబడినా ఇప్పటివరకు యూరియా ఇవ్వలేదని.. వ్యవసాయ అధికారుల పైన రైతులు మండిపడుతున్నారు. నిన్న 15 లారీల యూరియా వచ్చినా.. వరుసలో ఉన్న రైతులకు ఇవ్వకుండా....అధికారులు నేరుగా అధికార పార్టీ ఎవరికి చెబితే వాళ్లకు మాత్రమే యూరియా అందించారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details