కర్నూలు జిల్లాలో గతంలో మాదిరిగా ఈసారి కరవు తాండవించలేదు. అయినా వలసలు ఆగడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సాగు పనులు ముగియడం, రబీపై ఆశలు లేకపోవడం, ఉపాధి హామీ కూలీ గిట్టుబాటు కాకపోవడం.. వంటి కారణాలతో వేలాది కుటుంబాలు పొరుగు జిల్లాలకు, రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయి. గుంటూరు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు నిత్యం వందల మంది సుగ్గిబాట పడుతున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కౌతాళం, కోసిగి, మంత్రాలయం మండలాల పరిధిలో 21 గ్రామాలు ఇప్పటికే దాదాపు ఖాళీ అయ్యాయి. సుమారు 5 వేల మంది వలస వెళ్లినట్లు అంచనా. ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ వలసల ప్రభావం తీవ్రంగానే ఉంది. స్థానికంగా సాగు పనులకు వెళ్తే రూ.200 కూలీ వస్తుంది. గుంటూరు జిల్లాలో మిరపకోత పనులకు వెళ్తే పిల్లలకు రూ.250, పెద్దలకు రూ.500 వరకు చెల్లిస్తున్నారు. పిల్లలను సైతం వెంట తీసుకెళ్తున్నందున ఇక్కడి సర్కారీ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పడిపోయింది.
ఉపాధి లేక పల్లెల వలసలు.. ఎన్నికల వేళ నేతలకు ఇబ్బందులు - కర్నూలు నుంచి వలస వెళ్తున్న స్థానికులు
కర్నూలులో గతంలో లాగా కరువు లేదు.. అయినా వలసలు ఆగటం లేదు. ఉపాధి హామి కూలీ గిట్టుబాటు కాకపోవటం, ఖరీఫ్ సాగు పనులు ముగియటంతో స్థానికులు వలస వెళతున్నారు. ఎన్నికలు అయ్యేంతవరకు ఆగాలని నేతలు కోరుతున్నా.. వారు వినిపించుకోవటం లేదు.

ఉపాధి లేక పల్లెల వలసలు.. ఎన్నికల వేళ నేతలకు ఇబ్బందులు