కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్
'ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించాలి' - latest news on pawan kalyan
ప్రజలకు అవసరమైన పథకాలను గత ప్రభుత్వాలు ప్రవేశపెడితే... నూతనంగా అధికారం చేపట్టినవారు వాటిని కొనసాగించకపోవడం దారుణమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సంస్కృతి మారాలని పవన్ ఆకాంక్షించారు. కర్నూలు జిల్లాలో రెండోరోజు పవన్ పర్యటన కొనసాగుతోంది. జోహరాపురం బ్రిడ్జిని పరిశీలించిన ఆయన... వంతెన సమస్యపై స్థానికులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు బాగా ఆలోచిస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్