ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో నేడు పవన్​ కల్యాణ్​ పర్యటన

నేటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు కర్నూలులో పర్యటించనున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. యువతి హత్యాచారం కేసులో న్యాయం కోసం డిమాండ్​ చేస్తూ ర్యాలీ, బహిరంగ సభలో పవన్​ పాల్గొంటారని చెప్పారు.

By

Published : Feb 11, 2020, 4:53 PM IST

Updated : Feb 12, 2020, 2:41 AM IST

pavan kalyan coming to kurnool 11th of this month
కర్నూలులో నేడు పవన్​ కల్యాణ్​ పర్యటన

పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన వివరాలు వెల్లడిస్తొన్న జనసేన నేతలు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కర్నూలు జిల్లాలో నేడు, రేపు పర్యటించనున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన యువతి హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ ర్యాలీ చేపట్టనున్నారు. రాజ్‌విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ చేశాక... అక్కడే బహిరంగ సభ నిర్వహించనున్నారు. జిల్లాలోని వివిధ సమస్యలపై రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు జనసేన జిల్లా నేతలు తెలిపారు.

ఇదీ చూడండి:

దిశ' నిధుల ఖర్చుకు పాలనా అనుమతులు

Last Updated : Feb 12, 2020, 2:41 AM IST

ABOUT THE AUTHOR

...view details