కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దేవిబెట్టలో విద్యుదాఘాతంతో వీరేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పొట్టేలుని మేపేందుకు వెళ్లగా.. పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ కాలికి తగిలి మృతి చెందినట్లు గ్రామీణ ఎస్సై రామసుబ్బయ్య వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేసున్నట్లు వివరించారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - దేవిబెట్టలో వ్యక్తి మృతి న్యూస్
గొర్రెలను మేపేందుకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా దేవిబెట్టలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి