ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 6:15 PM IST

Updated : Jun 18, 2021, 1:06 AM IST

ETV Bharat / state

nara lokesh: హత్యకు గురైన తెదేపా నేతల కుటుంబాలను పరామర్శించనున్న నారాలోకేశ్

నేడు కర్నూలు జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) పర్యటించనున్నారు. హత్యకు గురైన తెదేపా నేతలు కుటుంబాలను పరామర్శించనున్నారు. వైకాపా నేతలే హత్యకు పాల్పడినట్లు లోకేశ్ ఆరోపించారు.

నారాలోకేశ్
నారాలోకేశ్

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో జరిగిన తెలుగుదేశం నాయకులు వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల హత్య కేసులో13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అన్నదమ్ములైన నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిలను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేయగా.....వారి అంత్యక్రియలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరుకానున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న లోకేశ్ పదిన్నర గంటలకు పెసరవాయి చేరుకుంటారు..

Last Updated : Jun 18, 2021, 1:06 AM IST

ABOUT THE AUTHOR

...view details