ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 14, 2020, 11:50 AM IST

Updated : Aug 14, 2020, 7:38 PM IST

ETV Bharat / state

భార్య, అత్త సహకారంతో మామను చంపిన అల్లుడు

నంద్యాల దేవనగర్‌లో అత్త సాయంతో అల్లుడు మామను హత్యచేశాడు. అనంతరం మృతదేహన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

నంద్యాల దేవనగర్​లో అత్త సాయంతో మామను చంపిన అల్లుడు
నంద్యాల దేవనగర్​లో అత్త సాయంతో మామను చంపిన అల్లుడు


కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్​లో దారుణం జరిగింది. మద్యం తాగి వచ్చి నిత్యం వేధించే నగేష్​ అనే వ్యక్తిని అల్లుడు మీరావలి దారుణంగా హతమార్చాడు. ఇందుకు అత్త, భార్య సైతం సహకరించారు. నగేష్​ తరచూ మద్యం తాగి వచ్చి అల్లుడు మీరావలిని తిడుతుండేవాడు. ఈ వైఖరి భార్య, కూతురుకు కూడా నచ్చలేదు.

ఈ క్రమంలో మద్యం తాగి వచ్చిన నాగేష్​ అల్లుడితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి మామపై.. మీరావలి కత్తితో తల, మెడపై దాడి చేసి హతమార్చాడు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కుటుంబసభ్యుల సహకారంతో ఆటోలో తరలిస్తుండగా.. తనిఖీలు చేస్తున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Aug 14, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details