ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అబ్దుల్ సలాం కేసు: సీఐ, హెడ్​ కానిస్టేబుల్ బెయిల్​ రద్దు - సలాం కేసు తాజా వార్తలు

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టై బెయిల్​పై ఉన్న సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లను డిసెంబర్ 2 సాయంత్రంలోపు కోర్టులో హాజరు కావాలని నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు ఆదేశించింది. ఈనెల 9న వారికి మంజూరైన బెయిల్​ను న్యాయస్థానం రద్దు చేసింది.

సీఐ, హెడ్​ కానిస్టేబుల్ బెయిల్​ రద్దు
సీఐ, హెడ్​ కానిస్టేబుల్ బెయిల్​ రద్దు

By

Published : Nov 30, 2020, 5:59 PM IST

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్​రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్​ను రద్దు చేస్తూ నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. డిసెంబరు 2 సాయంత్రంలోపు కోర్టులో హాజరు కావాలని వారిని ఆదేశించింది. పోలీసుల వేధింపుల కారణంగా ఆటో డ్రైవరు సలాం కుటుంబం రైలు కిందపడి ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లను ఈనెల 8న అరెస్టు చేశారు. 9న వారికి వారికి బెయిల్ మంజూరైంది.

వీరి బెయిల్ రద్దు చేయాలని మూడో అదనపు జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల పిటిషన్​ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపి...వారి బెయిల్​ను రద్దు చేసింది.

ABOUT THE AUTHOR

...view details