ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొట్టు బిళ్లలతో గాంధీ చిత్రం... నంద్యాల బాలిక ప్రతిభ

నంద్యాలకు చెందిన అనన్య అనే బాలిక రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. బొట్టుబిళ్లలతో గాంధీ చిత్రాన్ని వేసినందుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకుంది.

By

Published : Aug 8, 2019, 9:17 AM IST

మహాత్మాగాంధీ

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అనన్య.. తన ప్రతిభతో జాతీయ స్థాయి రికార్డులు సాధించింది. అక్టోబర్ 2 న గాంధీ జయంతిని పురస్కరించుకొని గత ఏడాది.. 1, 460 బొట్టు బిళ్లలతో మహాత్మాగాంధీ చిత్రాన్ని అనన్య వేసింది. ఈ చిత్రాన్ని పరిశీలించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, హై రేంజ్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు.. తమ రికార్టుల్లో చోటు కల్పించాయి. ఈ సమాచారాన్ని సంస్థ ప్రతినిధులు అనన్యకుమెయిల్ ద్వారా పంపించారు. సంబంధించిన ధృవీకరణ పత్రాలు.. 10 రోజుల్లో అందనున్నాయి. నంద్యాలలోని శ్రీనివాసనగర్ కు చెందిన అనన్య.. ప్రస్తుతం 8 వతరగతి చదువుతోంది.

ABOUT THE AUTHOR

...view details