కర్నూలు జిల్లా హోలిగొండ మండలంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు ఆందోళన చేశాయి. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని విమర్శించారు. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ముస్లింలు హెచ్చరించారు. మసీదు దగ్గర నుంచి సర్ధార్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో ముస్లీంలు ర్యాలీ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లాలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ
TAGGED:
muslims rally on CAB BILL