ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 8, 2019, 4:07 PM IST

ETV Bharat / state

అనిశా వలలో గూడూరు తహసీల్దార్... అనుచరుడు అరెస్ట్

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ లంచం తీసుకునేందుకు తన తరపున వేరే వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పాణ్యం బస్టాపులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఏసీబీ వలలో గూడూరు తహసీల్దార్... ఆమె అనుచరుడు అరెస్ట్

అనిశా వలలో గూడూరు తహసీల్దార్... ఆమె అనుచరుడు అరెస్ట్

కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ అనిశా వలకు చిక్కారు. రైతు నుంచి 4 లక్షలు లంచం తీసుకునేందుకు... తన తరఫున మహబూబ్‌ బాషా అనే వ్యక్తిని.. తహసీల్దార్‌ పంపించారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా.... హసీనాబీ పంపిన వ్యక్తిని అనిశా అధికారులు పట్టుకున్నారు. విచారించగా తహసీల్దార్‌ తనను పంపించినట్లు అనిశా అధికారులకు తెలిపాడు. అతని నుంచి 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌ బాషాను అరెస్టు చేసిన సమాచారాన్ని తెలుసుకున్న హసీనాబీ... పరారీలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details