కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం తహసీల్దార్ శ్రీనివాసులు కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం విధులకు హజరై ఇంటికి వచ్చిన తహసీల్థార్ ఫొన్ ఆఫ్ చేసి కర్నూలు సమీపంలోని దిన్నెదేవరపాడు వద్ద చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తె వివాహ విషయంలో కలత చెందినట్లు శ్రీనివాసులు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబకలహాలతో కర్నూలు జిల్లాలో తహసీల్దార్ ఆత్మహత్య - suicide news in kurnool dst
కుటుంబకలహాలతో కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం తహసీల్దార్ శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకున్నారు. కుమార్తె వివాహం విషయంలో అతడు కలత చెందినట్లు మృతుడి భార్య తెలిపారు.
కుటుంబకలహాలతో తహసీల్దార్ ఆత్మహత్య