ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 20, 2020, 4:21 PM IST

ETV Bharat / state

సంకల్​బాగ్ ఘాట్ వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభం

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా సంకల్​బాగ్ పుష్కర ఘాట్ వద్ద భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వాసవి సత్ర సముదాయం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు.

tungabhadra pushkaralu
సంకల్​బాగ్ ఘాట్ వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభం

పుష్కరాలు లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన దేశంలో మాత్రమే జరుగుతాయని రాజ్యసభ సభ్యులు టీజీ. వెంకటేష్ అన్నారు. తుంగభద్ర నదీ పుష్కరాల సందర్భంగా సంకల్​బాగ్ పుష్కర ఘాట్ వద్ద వాసవి సత్ర సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. భక్తులు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ.. పూజలు చేసుకోవాలన్నారు. కరోనా సోకిన భక్తులు కూడా పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్నారని.. అందరికీ మేలు జరగాలని టీజీ కోరారు.

ABOUT THE AUTHOR

...view details