ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 11, 2021, 4:27 PM IST

ETV Bharat / state

కర్నూలులో రెండో విడత అమ్మఒడి ప్రారంభం

కర్నూలులో రెండో విడత అమ్మఒడి పథకాన్ని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండ్యన్​​, డీఈవో సాయిరాంశంకర్​ పలువురు అధికారులు పాల్గొన్నారు.

MLA hafiz khan started the second installment Ammoodi
రెండో విడత అమ్మఒడి ప్రారంభించిన ఎమ్మెల్యే

కర్నూలులోని ఇందిరా గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో రెండో విడత అమ్మఒడి పథకం ప్రారంభించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 6,84,197 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. 4,12,884 మంది తల్లులకు.. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 619.326 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ వీరపాండ్యన్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సాయిరాంశంకర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details