సంక్రాంతి సంబరాలు.. కబడ్డీ ఆడిన మంత్రి, ఎస్పీ - కర్నూలు జిల్లాలో సంక్రాతి సంబరాల వార్తలు
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం, ఎస్పీ ఫకీరప్ప కబడ్డీ ఆడి అలరించారు.
minister jayaram playing kabbadi
By
Published : Jan 12, 2020, 6:32 PM IST
సంక్రాంతి సంబరాలు..కబడ్డీ ఆడిన మంత్రి, ఎస్పీ
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్ కుమార్, జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఐపీఎస్ అధికారి రవికృష్ణ హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి, ఎస్పీలు కబడ్డీ ఆడి అలరించారు. గతంలో కప్పట్రాళ్ల గ్రామాన్ని ఐపీఎస్ అధికారి ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్నారు.