కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్ఐ పాలేనికి చెందిన 22 మంది వలసకూలీలను స్థానిక నాయకులు అడ్డుకున్నారు. క్వారంటైన్ లేకుండా గ్రామంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తమకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఇళ్లకు పంపించాలని వలస కూలీలు డిమాండ్ చేశారు. పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
నందికొట్కూరులో వలస కూలీల అడ్డగింత - corona virus
వివిధ ప్రాంతాల నుంచి స్వగృహాలకు చేరుకున్న వలస కార్మికులను కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్ఐ పాలెంలో స్థానిక నాయకులు అడ్డుకున్నారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రామంలోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు.
![నందికొట్కూరులో వలస కూలీల అడ్డగింత Migrant laborers seeking refuge in a dormitory](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6774195-925-6774195-1586768755513.jpg)
వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న వలస కూలీలు