ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివాహిత మృతి... భర్తపైనే బాధిత కుటుంబం అనుమానం

By

Published : Jan 4, 2020, 9:45 AM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరులో వివాహిత మృతి చెందింది. ఆమె భర్తపైనే మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు.

married women died in kurnool dst nadikotkur related suspected about this died
చనిపోయిన మహిళ

నందికొట్కూరులో వివాహిత మృతి

కర్నూలు జిల్లా నందికొట్కూరులో గృహిణి సునిత.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునితకు 9 ఏళ్ల కిందట రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. ఈ కారణంగా భర్త వేరే పెళ్లి చేసుకుంటానని ఏడాది నుంచి సునితను ఇబ్బంది పెడుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వేరే మహిళతో రాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. విషయం తెలుకున్న సునిత... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details