కర్నూలులోని పలు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు ధర్నా చేపట్టారు. నగరంలోని బీ.టీ.ఆర్.నగర్, గణేష్ నగర్ 2, మమతానగర్ లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీల్లో వర్షపు నీరు నిలిచి ఉన్న కారణంగా.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను నిర్మించాలని వారు కోరారు.
డ్రైనేజీ కాలువలు నిర్మించాలంటూ ఆందోళన - cpm dharna latest news update
తమ కాలనీల్లో డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో స్ఠానికులు ధర్నా నిర్వహించారు. వర్షం వస్తే కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు.
![డ్రైనేజీ కాలువలు నిర్మించాలంటూ ఆందోళన Many colonists dharna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9259313-567-9259313-1603291198448.jpg)
సీపీఎం ఆధ్వర్యంలో పలు కాలనీ వాసులు ధర్నా