ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డ్రైనేజీ కాలువలు నిర్మించాలంటూ ఆందోళన

తమ కాలనీల్లో డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో స్ఠానికులు ధర్నా నిర్వహించారు. వర్షం వస్తే కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు.

By

Published : Oct 21, 2020, 11:10 PM IST

Published : Oct 21, 2020, 11:10 PM IST

Many colonists dharna
సీపీఎం ఆధ్వర్యంలో పలు కాలనీ వాసులు ధర్నా

కర్నూలులోని పలు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు ధర్నా చేపట్టారు. నగరంలోని బీ.టీ.ఆర్.నగర్, గణేష్ నగర్ 2, మమతానగర్ లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీల్లో వర్షపు నీరు నిలిచి ఉన్న కారణంగా.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను నిర్మించాలని వారు కోరారు.

ABOUT THE AUTHOR

...view details