పేదలకు వస్తువులు పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సంస్థ
కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో... ప్రభుత్వ పేదలకు పలు రకాల వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం రోజులుగా వివిధ గ్రామాల్లో సేకరించిన పాత వస్తువులను, దుస్తులను, ఇతర సామాగ్రిని అవసరమైన వారు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. పేదల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని... సంస్థ సభ్యుల సహకారంతో వివిధ గ్రామాల్లో తిరిగి పలు రకాల వస్తువులు సేకరించామని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు యాగంటి రెడ్డి తెలిపారు.
పేదలకు వస్తువులు పంపిణీ చేసిన మానవత స్వచ్ఛంద సంస్థ