ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 24, 2021, 6:49 AM IST

ETV Bharat / state

Missing: మేక పిల్లను కాపాడేందుకు వెళ్లి.. వ్యక్తి గల్లంతు

కర్నూలు జిల్లా వక్కిలేరు వాగులో వ్యక్తి గల్లంతయ్యాడు. నీళ్లు తాగేందుకు వెళ్లి కొట్టుకుపోతున్న మేక పిల్లను కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యాడని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. గాలింపు చర్యలు చేపట్టారు.

missing
missing

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం మల్లెవేముల గ్రామ సమీపంలోని వక్కిలేరు వాగులో... గ్రామానికి చెందిన వ్యక్తి గల్లంతయ్యాడు. మేకలు మేపేందుకు వెళ్లిన
యోహాన్ రాజు అలియాజ్ చిట్టిబాబు.. నీళ్లు తాగేందుకు వెళ్లి కొట్టుకుపోతున్న మేకపిల్లను గమనించాడు. కాపాడేందుకు వెళ్లిన చిట్టిబాబు గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి... పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details