ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆదోనిలో సోమవారం నుంచి కఠినంగా లాక్​డౌన్' - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సోమవారం నుంచి ఆదోనిలో కఠినంగా లాక్​డౌన్ అమలు చేస్తామని కమిషనర్ కృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. పట్టణ శివారులో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

మాట్లాడుతున్న డీ ఎస్పీ
మాట్లాడుతున్న డీ ఎస్పీ

By

Published : May 3, 2021, 9:53 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం నుంచి లాక్​డౌన్ కఠినంగా ఉంటుందని కమిషనర్ కృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. పట్టణ శివారులో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. మాస్కు ధరించకుండా పట్టణంలోకి ఎవరికి అనుమతించమని హెచ్చరించారు. కరోనా బాధితుల కోసం కొవిడ్ కేర్ సెంటర్​లో అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వ్యాపారులు... తమ దుకాణాల్లో వచ్చే వారికి మాస్కులు ఉంటేనే అనుమతించాలని పోలీసులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details