ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2020, 6:21 PM IST

ETV Bharat / state

లాక్​డౌన్​లో బయటికొచ్చాడు.. పోలీసులు అవాక్కయ్యేలా జవాబు చెప్పాడు!

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్​డౌన్ అమల్లో ఉన్నా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా బయటికి వస్తున్నారు. లాక్​డౌన్ అమల్లో ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి బయటికి వచ్చాడు. ఎందుకని అడగ్గా అతను చెప్పిన సమాధానానికి పోలీసులు అవాక్కయ్యారు.

lock down in kurnool district
lock down in kurnool district

కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్​డౌన్ కొనసాగుతోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా విభజించి కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు సూచిస్తున్నారు.

కొందరు ఏదో కారణం చెప్పి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ పై బయటకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకుని ప్రశ్నించారు. అతను నవరత్న ఆయిల్ కోసం అని చెప్పగా... అవాక్కయ్యారు. హెచ్చరించి పంపించేశారు.

ఇవీచదవండి:భారత్​లో 548 మంది వైద్య సిబ్బందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details