తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉన్న కర్నూలు జిల్లాలో ఎన్నికల కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, డబ్బు జిల్లాలోకి రాకుండా చూసేందుకు జిల్లా నలుమూలల 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కడప, అనంతపురం జిల్లాలను సైతం సరిహద్దులుగా కలిగి ఉండటంతో జిల్లా సరిహద్దుల వద్ద 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. వాహన రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు..
ఎన్నికల వేళ.. జిల్లాలో 15 చెక్పోస్టులు ఏర్పాటు - కర్నూలు జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు వార్తలు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోకి మద్యం, డబ్బు అక్రమ రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
![ఎన్నికల వేళ.. జిల్లాలో 15 చెక్పోస్టులు ఏర్పాటు 15 check post started in kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10481637-117-10481637-1612336303924.jpg)
ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు
ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు
ఇవీ చూడండి...:రహదారి కోసం ఎన్నికలు బహిష్కరించిన గ్రామం