ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంచలింగాల చెక్​పోస్టు వద్ద తనిఖీలు.. ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం

By

Published : Feb 28, 2022, 11:47 AM IST

Ornaments Seized: పంచలింగాల చెక్​పోస్టు వద్ద భారీగా ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. వీటిని తరలిస్తున్న రాజస్థాన్​కు చెందిన కపిల్​ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

seized gold at panchalingala checkpost
seized gold at panchalingala checkpost

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రాజస్థాన్​కు చెందిన కపిల్ అనే యువకుడు బంగారు ఆభరణాలు వజ్రాలు తీసుకొని వెళుతుండగా అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 840 గ్రాముల బంగారు ఆభరణాలు 57 వజ్రాలు గుర్తించారు.

ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో.. వాటిని స్వాధీనం చేసుకొని కపిల్​ను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సెబ్ సీఐ మంజుల తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details