ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కర్నూల్​ను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతాం'

కర్నూలు సిటీని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని నూతనంగా ఎన్నికైన మేయర్ బీవై. రామయ్య అన్నారు. వైకాపా జిల్లా కార్యాలయంలో డిప్యూటీ మేయర్​తో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు.

By

Published : Mar 19, 2021, 7:53 PM IST

kurnool mayor and deputy mayor
కర్నూలు మేయర్ బీవై. రామయ్య​, డిప్యూటీ మేయర్ రేణుకా

కర్నూలు మేయర్ బీవై. రామయ్య​, డిప్యూటీ మేయర్ రేణుకా​ జిల్లాలోని వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరాన్ని ప్లాస్టిక్​ రహితంగా మారుస్తామని మేయర్​ తెలిపారు. ఇంకా ఇరవై సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి కొనసాగుతాడన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయపార్టీ కూడా మనుగడ సాధించలేవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కాదని అగ్రవర్ణాల రిజర్వేషన్లలను తగ్గించి... బీసీలకు పది శాతం ఎక్కువగా ఇచ్చిన ఘనత సీఎం జగన్​కే దక్కిందన్నారు. సిటీలో ట్రాఫిక్​ సమస్యలను తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపడతామన్నారు. జగన్​ పాలనకు ప్రజల్లో మంచి స్పందన వచ్చినందుకే తాము ఎన్నికల్లో గెలిచామని డిప్యూటీ మేయర్ రేణుకా అన్నారు.

ABOUT THE AUTHOR

...view details