రాయలసీమవాసుల వైద్య ప్రదాయిని కర్నూలు సర్వజన ఆస్పత్రి అరుదైన ఘనత సాధించింది. క్లిష్టమైన 400 శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి అందరి మన్ననలు అందుకుంటోంది. 2016లో కర్నూలు సర్వజన ఆస్పత్రిలో గత ప్రభుత్వ సహకారంతో.. 7 కోట్ల రూపాయల వ్యయంతో.. సీటీవీఎస్ సర్జన్ ప్రభాకర్ రెడ్డి.. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. రెండు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 7 పడకల ఐసీయూ, 20 పడకల ఎయిర్ కండిషన్డు వార్డు విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ చెప్పారు. ఆయన సేవలను ప్రశంసించిన సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి.. ఇలానే మరెంతో మందికి ప్రాణదానం చేయాలని కోరారు.
అరుదైన ఘనత సాధించిన కర్నూలు సర్వజన ఆస్పత్రి
క్లిష్టమైన 400 శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి అందరి మన్ననలు అందుకుంటోంది కర్నూలు సర్వజన ఆస్పత్రి. కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ సేవలను ప్రశంసించిన సూపరిండెంటెంట్ నరేంద్రనాథ్ రెడ్డి.. ఇలానే మరెంతో మందికి ప్రాణదానం చేయాలని కోరారు.
కర్నూలు సర్వజన ఆస్పత్రి