ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీపీ మృతి.. చంద్రబాబు, లోకేశ్ దిగ్బ్రాంతి - కర్నూలు మాజీ ఎంపీపీ మృతి వార్తలు

తెలంగాణలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి మృతి చెందాడు. కారు టైరు పేలటంతో ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో కర్నూలు మాజీ ఎంపీపీ మృతి
రోడ్డు ప్రమాదంలో కర్నూలు మాజీ ఎంపీపీ మృతి

By

Published : Apr 20, 2022, 4:50 PM IST

Updated : Apr 20, 2022, 5:46 PM IST

తెదేపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి కుమారుడు, కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. తెలంగాణలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్దకు చేరుకోగానే.. టైరు పేలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

రాజవర్థన్‌రెడ్డి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజవర్థన్‌రెడ్డి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి: Attack On Woman: పల్నాడు జిల్లాలో దళిత మహిళపై దాడి.. ఎందుకంటే..!

Last Updated : Apr 20, 2022, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details