ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దయచేసి.. తరగతి గదులు నిర్మించండి

పాఠశాలలు.. విద్యార్థుల భవితవ్యానికి పునాదులు. అక్కడ చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు వసతులు సరిగా కల్పించడ లేదు. కర్నూలు జిల్లా నగరూరు గ్రామం ప్రాథమిక పాఠశాలనే ఇందుకు ఉదాహరణ.

By

Published : Dec 23, 2019, 11:56 PM IST

దయచేసి.. తరగతి గదులు నిర్మించండి
దయచేసి.. తరగతి గదులు నిర్మించండి

దయచేసి.. తరగతి గదులు నిర్మించండి

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామం ప్రాథమిక పాఠశాలలో రెండేళ్ల క్రితం నూతన భవనలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. తరగతి గదులు లేక పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఉపాధ్యాయుల పాఠాలు బోధిస్తున్నారు. నిర్మాణ పనులు నిలుపుదలతో.. చెత్తా చెదారం పేరుకుపోయి అధ్వానంగా మారింది. మరోవైపు పాఠశాలలోకి పాములు వస్తున్నాయని పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ బడి నిర్మించి 50 ఏళ్లైంది. దాతల సహకారంతో రెండు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. గదులను నిర్మిస్తే.... మరో వంద మంది విద్యార్థులు వస్తారని గ్రామస్థులు చెబుతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలకు తరగతి గదులు నిర్మించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వేసవి దాహార్తి తీర్చాలని ఇప్పటి నుంచే ధర్నా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details