కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గురువారం జిల్లాలో 66 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 59,027 మందికి ఈ వ్యాధి సోకగా.. 57,799 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 748 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం మృతుల సంఖ్య నమోదు కాలేదు. కరోనా వల్ల ఇప్పటిదాకా 480 మంది చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
జిల్లాలో 66 కొత్త కేసులు నమోదు - కర్నూలు జిల్లా తాజా కరోనా వార్తలు
కర్నూలు జిల్లాలో గురువారం 66 మందికి కరోనా వ్యాధి సోకినట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య నమోదు కాలేదు.
![జిల్లాలో 66 కొత్త కేసులు నమోదు kurnool district latest corona update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9274576-299-9274576-1603373484882.jpg)
జిల్లాలో తాజాగా నమోదైన కేసులు