మంత్రాలయం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి సతీమణి ప్రచారం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని రంగాపురం, తారాపురం గ్రామాల్లో తెదేపా ప్రచారం నిర్వహించింది. అసెంబ్లీ అభ్యర్థి తిక్కారెడ్డి తరఫున సతీమణి వెంకటేశ్వరమ్మ ప్రచారం చేశారు. ఇంటింటికీతిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలన వస్తుందన్నారు. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇవీ చూడండి.