జిల్లాలో 332కు చేరిన కరోనా కేసుల సంఖ్య - latest news of corona in kuronool dst
కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 332కు చేరింది. మంగళవారం ఒక్క రోజే 40 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
![జిల్లాలో 332కు చేరిన కరోనా కేసుల సంఖ్య kurnool corona cases reaches to 332](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6979527-798-6979527-1588095216126.jpg)
332కు చేరిన కర్నూలు కరోనా కేసుల సంఖ్య
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రోజు ఒకేసారి 40 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాతో 9 మంది మృత్యువాతపడ్డారు. కోలుకుని 43 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 280 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు