కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రోజు ఒకేసారి 40 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాతో 9 మంది మృత్యువాతపడ్డారు. కోలుకుని 43 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 280 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు