ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బెంగళూరు - హైదరాబాద్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయండి' - రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలంటూ కర్నూలు పౌర సంక్షేమ సంఘం నేతల ధర్నా

బెంగళూరు - హైదరాబాద్ రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యంపై.. కర్నూలు పౌర సంక్షేమ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. పై వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

kurnool civilian society protests
జాతీయ రహదారిపై కర్నూలు పౌర సంక్షేమ సంఘం ధర్నా

By

Published : Feb 10, 2021, 9:27 PM IST

కర్నూలులోని బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారి మీద నిర్మిస్తున్న పై వంతెన పనులు... మూడేళ్లు గడిచినా పూర్తికావటం లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రహదారులు అధ్వాన్నంగా మారాయంటూ.. ఆ సంఘం సభ్యులు రోడ్డుపై నిరసనకు దిగారు.

దుమ్ము, ధూళి వల్ల స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పౌర సంక్షేమ సంఘం నేతలు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details