ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 7, 2020, 11:58 PM IST

ETV Bharat / state

ఈ-నామ్‌ పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేయండి

కర్నూలు జిల్లా రైతుల నుంచి క్వింటాలు 770 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు.

karnool collector meeting on onions
కర్నూలులో ఉల్లి

కర్నూలు జిల్లా రైతుల నుంచి క్వింటాలు 770 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయనా ఆడిటోరియలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని గూడూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, కోసిగి, డోన్ మార్కెట్లలో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఓపెన్ ఆక్షన్‌లో కాకుండా ఈ-నామ్‌ పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details