ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బేతంచర్లలో కర్ణాటక మద్యం పట్టివేత... ఐదుగురు అరెస్ట్ - illegal liquor seized in bethamcherla kurnool

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కర్నూలు జిల్లా బేతంచర్ల వద్ద పోలీసులు పట్టుకున్నారు. సూమారు 12 వందల 25 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి నుంచి వస్తున్న డీసీఎం లారీలో ఈ మద్యాన్ని రవాణా చేస్తున్నట్లు డీఎస్పీ నరసింహ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు.

బేతంచర్లలో కర్ణాటక మద్యం పట్టివేత... ఐదు మంది అరెస్ట్, ఇద్దరు పరారీ
బేతంచర్లలో కర్ణాటక మద్యం పట్టివేత... ఐదు మంది అరెస్ట్, ఇద్దరు పరారీ

By

Published : Aug 2, 2020, 5:05 PM IST



కర్నూలు జిల్లా బేతంచర్లలో కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగాపురం రైల్వే గేట్ సమీపంలో డీసీఎం లారీలో తరలిస్తున్న మద్యం సీసాలను పట్టుకున్నారు. 25 కేసులలో 12వందల 25 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ నరసింహ రెడ్డి తెలిపారు. డీసీఎం లారీ యజమాని గురుమూర్తి, శేఖర్ బళ్లారిలో పాలిష్ బండల వ్యాపారం చేస్తున్నారు. వీరు బేతంచర్ల నుంచి పాలిష్ బండలను బళ్లారికి లోడ్​ పంపించి అక్కడినుంచి వచ్చేటప్పడు కర్ణాటక మద్యాన్ని వాహనంలో తీసుకువచ్చి బేతంచర్లలో అధిక రేట్లకు వ్యాపారులకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేయగా.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బేతంచర్లలో కర్ణాటక మద్యం పట్టివేత... ఐదు మంది అరెస్ట్, ఇద్దరు పరారీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details