ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక సరిహద్దులో... సందడిగా పల్లెపోరు - కర్నూలు జిల్లాలో కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నాలుగవ విడత పల్లెపోరు

రాష్ట్రానికి చెందిన ఆ సరిహద్దు గ్రామాల ప్రజలంతా.. కన్నడ మాట్లాడతారు. సంప్రదాయాలూ అక్కడివే పాటిస్తారు. విద్య, వైద్యం, ఇతర పనులు ఏమున్నా కర్ణాటకలోని బళ్లారి వెళుతుంటారు ఇక్కడి గ్రామస్థులు. ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ పథకాలకు మాత్రం కర్నూలు జిల్లాలోని మండల కేంద్రాలకు వస్తారు. కర్ణాటక సరిహద్దుల్లోని వివిధ గ్రామాల్లో పల్లె పోరు కోసం ఓట్ల వేట రసవత్తరంగా సాగుతోంది.

karnataka border villages ready for fourth phase local elections
నాలుగవ విడత పల్లెపోరుకు సిద్ధమవుతున్న కర్ణాటక సరిహద్దు గ్రామాలు

By

Published : Feb 11, 2021, 5:45 PM IST

కర్నూలు జిల్లా కౌతాళం, కోసిగి, మంత్రాలయం, ఆదోనికి సంబంధించిన పెద్దహరివాణం, హాలహర్వి, హోళగుంద మండలాల పరిధిలోని పలు పంచాయతీలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాయి. కౌతాళానికి చెందిన ఏడు గ్రామాల్లో 8,437 ఓటర్లు, కోసిగికి సంబంధించిన ఆరు గ్రామాల్లో 9,733 మంది ఓటర్లు ఉన్నారు. ఆదోని పెద్దహరివాణంలో 5,721 ఓటర్లు, హాలహర్వి గూళ్యం(7,847), సిద్ధాపురం(2,183), విరుపాపురం(2,438), చింతకుంట(4,650), సాకిబండ(1,060), హోళగుంద పరిధిలోని నాలుగు పంచాయతీల్లో 7,060 మంది కన్నడ సరిహద్దు ఓటర్లు ఉన్నారు.

దేవాలయాల అభివృద్ధికి హామీలు:

ఈ మండలాల పరిధిలోని గ్రామాల్లో కన్నడ మాట్లాడటంతోపాటు, ఆచార సంప్రదాయాల్లోనూ ధార్మికత ఎక్కువ. ప్రతి ఇంటి నుంచి వంద శాతం భక్తులు ఆలయాలకు వెళ్తుంటారు. ఈ కారణంగా ఆయా పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థులు.. దేవాలయాల అభివృద్ధి, మండపాల నిర్మాణాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు హామీలిచ్చి ఓట్లు రాబట్టే యత్నాలు చేస్తున్నారు. సరిహద్దులోని నదీతీర గ్రామాల్లో రైతుల మోటార్ల కోసం విద్యుత్తు, పైపులైన్ల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. విద్యుత్తు పరివర్తకం(ట్రాన్స్‌ఫార్మర్‌) మరమ్మతులకు గురైతే వెంటనే ప్రత్యామ్నాయం చేసేందుకు సహాయపడే గ్రామ నాయకులపై రైతు ఓటర్లకు గురి ఉంటుంది. ఇలాంటివి పరిష్కరించే పట్టున్న అభ్యర్థులకు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపడం పరిపాటి.

ముందస్తుగా...

మద్యం సంగతి పక్కనపెడితే ఓటర్లకు తాయిలాల పంపిణీ ఇక్కడ సులువుగా జరిగిపోతుంది. కర్ణాటక పరిధిలో మద్యం తక్కువ ధరకు దొరుకుతుంది. రాత్రిళ్లు నది దాటించి తాగినోళ్లకు తాగినంత సరకును సరిహద్దు గ్రామాల్లోకి చేరుస్తున్నారు. పెద్ద ఖర్చు లేకుండానే మద్యం కొనుగోళ్లు జరిగిపోవడంతో పాటు ఇక్కడ పంపిణీ గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుండటం అభ్యర్థులకు కలిసి వస్తోంది. ఈ కన్నడ సరిహద్దు గ్రామాలకు 4వ దశలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి బరిలో దిగే అభ్యర్థులు ఇప్పటినుంచే మద్యం అందిస్తుండటంతో సరిహద్దుల్లో సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:

ఆదోనిలో కలకలం రేపుతున్న చిరుతల సంచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details