ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High Court: గ్రామ సచివాలయ నిర్మాణం నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

By

Published : Aug 10, 2021, 5:48 PM IST

కర్నూలు జిల్లా సింగవరంలో గ్రామ సచివాలయ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదలశాఖ స్థలంలో సచివాలయం నిర్మాణం చేస్తున్నారని..అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయటంతో ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Interim orders of the High Court halting the construction of the village secretariat
గ్రామ సచివాలయ నిర్మాణం నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

కర్నూలు జిల్లా సింగవరంలో గ్రామ సచివాలయ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదలశాఖ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణం చేస్తున్నారని..అదే గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణాన్ని నిలుపుదల చేసేలా ఆదేశిలివ్వాలని హైకోర్టును కోరారు. పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం నిర్మాణాన్నినిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details