ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని.. కబడ్డీ ఆడుతూ వినూత్న నిరసన - కబడ్డీ ఆడుతూ వినూత్న నిరసన తెలిపిన వామపక్షాలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్​కు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. నంద్యాలలో వామపక్ష పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. బస్టాండ్ ఎదుట రహదారిపై వామపక్ష పార్టీల నాయకులు కబడ్డీ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.

Innovative protest playing kabaddi to stop Visakha steel privatization
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని.. కబడ్డీ ఆడుతూ వినూత్న నిరసన

By

Published : Mar 5, 2021, 4:42 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని.. కబడ్డీ ఆడుతూ వినూత్న నిరసన

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్​లో ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారాయి.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. నంద్యాలలో వామపక్ష పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బంద్​ను​ విజయవంతం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.

ఎమ్మిగనూరులో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. బస్సులు తిరగలేదు. వామపక్షాలు 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అంటూ నినదించారు.

ఆదోనిలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు వామపక్షాలు, తెదేపా, ప్రజా కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

కోడుమూరు పట్టణంలో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించటం నిరసిస్తూ.. సీపీఐ, సీపీఎం, తెదేపా, వైకాపా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.


ఇదీ చదవండి:

నిరసనలు కొనసాగుతున్నా.. అమ్మకానికి అడుగులు !

ABOUT THE AUTHOR

...view details