ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి పోటెత్తెత్తున్న వరద ప్రవాహం..

By

Published : Jul 18, 2021, 10:31 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 816.40 అడుగులకు చేరుకుంది.

srisailam dam
srisailam dam

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జూరాల ప్రాజెక్ట్ నుంచి 85,098 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 816.40 అడుగులకు చేరుకుంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 38 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్​కు విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 3.264 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details