ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్​ - nandyal police caught illegal liquor

అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు లక్షల రూపాయలు విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

illegal liquor caught by nandyal police and three people arrested
మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్న నంద్యాల రెండ పట్టణ పోలీసులు

By

Published : May 19, 2020, 2:10 PM IST

పత్తి తరలింపు పేరుతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి అక్కడ నుంచి మద్యం సీసాలు అక్రమంగా తెచ్చి అమ్మి.. సొమ్ము చేసుకుంటున్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. పట్టణంలో హౌసింగ్ బోర్డు ప్రాంతంలో లారీ, ద్విచక్రవాహనంపై తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన 175 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారయ్యారు.

ABOUT THE AUTHOR

...view details