ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 12, 2020, 12:18 PM IST

ETV Bharat / state

భార్యను బండరాయితో మోది.. భర్త ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లాలో కుటుంబకలహాలతో ఓ భర్త తన భార్య గొంతుకోసి, తలపై బండతో మోది తాను కత్తితో కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

husband attack on his wife and committed suicide  in kurnool dst nandyala
husband attack on his wife and committed suicide in kurnool dst nandyala

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి, తలపై రాయితో మోదాడు. అనంతరం తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. పట్టణంలోని తెలుగుపేటకు చెందిన బాలరాజు కత్తితో తన భార్య గొంతు కోసి తలపై బలంగా కొట్టాడు. అదే కత్తితో బాలరాజు గొంతు కోసుకున్నాడు. స్థానికులు వారిని నంధ్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాలతోనే ఈ విధంగా చేసినట్లు భర్త బాలరాజు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details