కర్నూలులోని ఓ బంగారం దుకాణంలో పనిచేసే సత్యనారాయణ... హైదరాబాద్ నుంచి ఒక కేజీ 818 గ్రాముల బంగారు అభరణాలను ఓ ప్రైవేటు బస్సులో తీసుకువస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ సుమారు రూ.1.80కోట్లు ఉంటుందని ఎస్ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. బంగారు ఆభరణాలను సీజ్ చేసి తాలూకా పోలీసులకు అప్పగించారు.
Gold seize: పంచలింగాల చెక్పోస్ట్ వద్ద బంగారం పట్టివేత - kurnool crime
కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారం ఆభరణాలను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం బంగారాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు.
పంచలింగాల సరిహద్దు వద్ద భారీగా బంగారం పట్టివేత