ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుపేదకి...ఇంటి స్థలం, సాగు భూమి ఇవ్వాలి - నిరుపేదోడికి ఇంటి స్థలం సాగు భూమి ఇవ్వాలి

అర్హులైన ప్రతి నిరుపేదవారికి  ఇంటి స్థలం, సాగుభూమి ఇవ్వాలంటూ...సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పత్తికొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

"నిరుపేదోడికి...ఇంటి స్థలం, సాగు భూమి ఇవ్వాలి"

By

Published : Aug 29, 2019, 11:38 PM IST

Updated : Jul 21, 2022, 11:20 AM IST

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నిరసనకు దిగారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం, సాగు భూమి పంపిణీ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం ఉగాది నాటికి ఇంటి స్థలాల పంపిణీ చేస్తామని చెబుతున్నా... అందుకు అవసరమైన స్థల సేకరణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ప్రతి నిరుపేదోడి సొంతింటి కల సాకారం అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డికి లేఖ రాశామని తెలిపారు.

Last Updated : Jul 21, 2022, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details