ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా నివారణార్థం.. శ్రీశైలంలో ముగిసిన మహా హోమం

By

Published : May 2, 2020, 8:06 PM IST

కరోనా వైరస్ నిర్మూలన కోసం కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగిన హోమం... ఈరోజుతో ముగిసింది. 41 రోజుల పాటు రుద్ర,చండి మహా మృత్యుంజయ హోమాలు నిర్వహించారు.

homam for corona is complited in kurnool dst  srisailam
homam for corona is complited in kurnool dst srisailam

కర్నూలు జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలోని దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో 41 రోజులపాటు జరిగిన హోమాలు ముగిశాయి. కరోనా వైరస్ నిర్మూలన కావాలన్న సంకల్పంతో రుద్ర ,చండీ, మహా మృత్యుంజయ హోమాలు నిర్వహించారు.

ఆశ్రమాధిపతి అవధూత గిరి మహారాజ్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. హోమాలు నిర్వహించడం వల్ల ప్రకృతిలో సంభవించే వైపరీత్యాల నుంచి ప్రజలు సురక్షితంగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details