ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయి పత్తి విక్రయాలు

By

Published : Nov 9, 2020, 10:59 PM IST

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇవాళ రికార్డు స్థాయిలో పత్తి విక్రయాలు జరిగాయి. 17,238 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయి పత్తి విక్రయాలు
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయి పత్తి విక్రయాలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇవాళ రికార్డు స్థాయిలో పత్తి విక్రయాలు జరిగాయి. పత్తి విక్రయించేందుకు రైతులు పెద్ద ఎత్తున దిగుబడులతో మార్కెట్​కు వచ్చారు. సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డు పత్తి దిగుబడులతో కళకళలాడుతోంది. ఈరోజు 17,238 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు. క్వింటా పత్తి ధర గరిష్ఠంగా 5,139 రూపాయలు ఉండగా...,కనిష్ఠ ధర 3,049 రూపాయలు పలికింది.

ABOUT THE AUTHOR

...view details