ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భానుడి ఉగ్రరూపం.. రాయలసీమ బేజారు! - రాయలసీమలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు

రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో రాయలసీమ ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడు ఉగ్రరూపం దాల్చటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మార్చి నుంచే ఎండలు ఠారెత్తిస్తుండటంతో రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అనే ఆందోళన మరింత పెరిగింది.

high temperatures in kurnool, rayalaseema temperature are high
కర్నూలులో భారీ ఉష్ణోగ్రతలు నమోదు, తీవ్ర ఎండలకు రగులుతున్న రాయలసీమ

By

Published : Apr 7, 2021, 6:17 PM IST

రాయలసీమలో భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

రాయలసీమ జిల్లాల్లో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గతనెల చివరి నాటికి కర్నూలు జిల్లాలో ఎండలు 40 డిగ్రీలకు చేరడం.. ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ ఆరంభం నుంచి భానుడు చూపిస్తున్న ఉగ్రరూపానికి.. ఇళ్లలో ఉక్కపోత అధికంగా ఉంటోంది. ఏసీలు, కూలర్లు లేకుండా ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.

కర్నూలు నగరంలో ఇప్పటి వరకు అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ప్రస్తుతం 3 నుంచి 4 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దానికి తోడు వడగాలులూ వీస్తున్న కారణంగా.. ప్రజల బాధలు వర్ణనాతీతం అవుతున్నాయి. చీకటి పడినా వేడిగాలులు చల్లబడటం లేదు. రాత్రి వేళల్లోనూ 28 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details