కర్నూలు జిల్లా అధోని వ్యవసాయ మార్కెట్ యార్డులో.. పత్తికి ధర రికార్డు స్థాయి దక్కింది. వ్యవసాయ మార్కెట్ యార్డు చరిత్రలోనే.. ఈ ధర అధికమని వ్యాపారులు చెబుతున్నారు. క్వింటాల్ పత్తి ధర గరిష్ఠంగా 9,399 రూపాయలు పలికిందని చెప్పారు. కనిష్ఠంగా 6,900 రూపాయల ధర లభించిందని అన్నారు. ధర భారీగా పలకడంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
COTTON PRICE : పత్తి రైతు "ధర"హాసం.. ఆధోనిలో రికార్డు ధర! - ADHONI MARKET
కర్నూలు జిల్లా ఆధోని వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డ్ స్థాయి ధర లభించింది. ఇతర రాష్ట్రాలతో పోలీస్తే ఆధోనిలోనే ధర ఎక్కువగా ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ధర పెరుగుదల పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
![COTTON PRICE : పత్తి రైతు "ధర"హాసం.. ఆధోనిలో రికార్డు ధర! ఆదోనిలో రికార్డు స్థాయిలో ధర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14041813-28-14041813-1640779560784.jpg)
ఆదోనిలో రికార్డు స్థాయిలో ధర
దిగుబడులు తగ్గడం వల్ల పత్తికి మంచి డిమాండ్ ఏర్పడి, ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాలతో ధరలతో పోలిస్తే.. రాష్ట్రంలోని ఆధోని మార్కెట్లోనే అత్యధిక ధరలు ఉన్నాయని వ్యాపారస్థులు అంటున్నారు.
ఇదీచదవండి :